Tuesday, September 19, 2017

కమ్మ వారి ప్రాభవం

#కమ్మవారిచరిత్ర --- #కమ్మక్షత్రియప్రభువులక్షాత్రధర్మం --- #సనాతనధర్మపరిరక్షణ -  #అమరావతిప్రభువుశ్రీరాజావాసిరెడ్డివెంకటాద్రినాయుడుగారు, అమరావతి నగర సృష్టికర్త చింతపల్లి,అమరావతి సంస్థానాధీశులు,హిందూదేవాలయాలజీర్ణోద్ధారకుడు, సనాతనవైదికధర్మపరిరక్షకుడు, అపరదానకర్ణుడు, ప్రజారంజకపరిపాలకుడు..............

కృష్ణాతీరాన్ని సస్యశ్యామలం చేసి... నదిని అద్భుతంగా వినియోగించుకున్న #కమ్మప్రభువుల్లో #చాళుక్యనారాయణశ్రీరాజావాసిరెడ్డివెంకటాద్రినాయుడుగారు మొదటివరుసలో ఉంటారు.ఆంగ్ల, ఫ్రెంచి పాలకులకు కొరకరాని కొయ్యగా కృష్ణాతీరంలో స్వతంత్ర పాలన సాగించిన వ్యక్తి ఈయన. ఆయన ఏలుబడిలో 12 పరగణాలు ఉండేవని నాయుడు పరిపాలన మీద వెలువడిన కైఫీయతులు తెలియజేస్తున్నాయి. 1761లో జన్మించిన నాయుడు 22 ఏళ్లకే సింహాసనాధీశుడై 1816 వరకు పాలన సాగించాడు.అచ్చంపేట మండలంలోని చింతపల్లిని తన జమిందారికీ ప్రధాన కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు కొనసాగించిన నాయుడు, ఆ తర్వాత రాజధానిని అమరావతికి మార్చారు. నిజాం నవాబుల దాతృత్వంతో అమరావతి అమరేశ్వరాలయానికి ఖమ్మంజిల్లా మధిరలో ఉన్న 400 ఎకరాల పైచిలుకు భూములను సమకూర్చగలిగాడాయన. నందిగామ, అమరావతి, రాజమండ్రి, బందరు తదితర ప్రాంతాలన్నీ ఈయన ఏలుబడిలోనే ఉండేవి.....

 #108హిందూదేవాలయాలజీర్ణోద్ధారకుడు -  #సనాతనవైదికహిందూధర్మపరిరక్షకుడు.............

అమరావతి అమరేశ్వరాలయానికి, మంగళగిరి పానకాల లక్ష్మీ నృసింహస్వామి కోవెలకు రాజగోపురాలను, మండపాలను, ప్రాకారాలను కట్టించారాయన. మొత్తం 108 దేవాలయాలను జీర్ణోద్ధరణ చేసి ఒకే లగ్నంలో ఆ కోవెలలన్నింటిలోనూ #శివలింగాలను ప్రతిష్ఠించాడు. చేబ్రోలులో బ్రహ్మదేవునికి ఆలయం నిర్మించాడు..........

#అపరదానకర్ణుడు..............

మూడుసార్లు తులాభారం తూగి తన బరువుకు సమానమైన బంగారాన్ని ప్రజలకు పంచిపెట్టాడు. 66 గ్రామాలను బ్రాహ్మణులకు అగ్రహారాలుగా దానమిచ్చాడు. తల్లి అచ్చమాంబ పేరుతో #అచ్చమ్మపేటను (నేటి అచ్చంపేట), తండ్రి జగ్గభూపాలుడి పేరుతో కృష్ణాజిల్లాలో #జగ్గయ్యపేటను, తన పేరుతో #మన్నెసుల్తాన్‌పాలేన్ని (బెల్లంకొండ మండలంలో) నిర్మించాడు. నవ్యాంధ్ర రాజధానిగా గుర్తించిన ప్రాంతం (సీఆర్‌డీఏ పరిధి) మొత్తం నాటి వెంకటాద్రినాయుడు పాలనలోనిదే. కృష్ణానదిపై సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన గురించి ఆయన ఆ కాలంలో ఆలోచించారు.....

#ప్రజారంజకపరిపాలకుడు...........

దోపిడీ దొంగలను అణచేయడం, రహదార్లు ఏర్పాటు, నగరాలు నిర్మించడం, "ఆధ్యాత్మిక చింతన కోసం" ఆలయాలు కట్టించడం #నాయుడిపాలనాదర్పాన్ని తెలియజేస్తున్నాయి. శాతవాహనుల రాజధానిగా వెలుగొందిన #ధాన్యకటకాన్ని (జంట గ్రామాలైన ధరణికోట, అమరావతిల ప్రాంతం) పాలనా కేంద్రంగా ఎంచుకోవడం ద్వారా ఇక్కడి సౌకర్యాలను వినియోగించుకుని నాయుడు పటిష్టమైన రాజ్యపాలనకు మార్గాన్ని ఏర్పరచుకున్నారు...

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఒకప్పుడు రూపం ఇచ్చిన సృష్టికర్త, ""రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు"". తక్కువ కాలమే జీవించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు.. ఎన్నో మంచిపనులు చేసి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. వాసిరెడ్డి జగన్న, అచ్చమాంబ దంపతులకు 1783 ఏప్రిల్ 27న రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు జన్మించారు. కేవలం ముప్ఫై మూడేళ్లే బతికిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 1816లో మఱణించారు. ఇండియాలో #బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాడిన మొట్టమొదటి సంస్థానాధీశుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు...

కృష్ణా డెల్టా పరిధిలో వెయ్యికి పైగా ఆలయాలు నిర్మించిన ఘనత ఆయన సొంతం. అమరావతి, చేబ్రోలు, పొన్నూరు, మంగళగిరి ప్రాంతాలను ఆయన పాలించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అమరావతి ఘనతకు ప్రధాన కారణం వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి పాలనేనని చరిత్రకారులు చెబుతారు. తన రాజధానిని #చింతపల్లి నుంచి కృష్ణా నది ఒడ్డున ఉన్న అమరేశ్వరానికి మార్చారు. కేవలం రెండేళ్లలోనే #అమరావతి పట్టణాన్ని నిర్మించిారు. రాజభవనానికి #వైజయంతిమహల్ అని రాజదానికి #అమరావతి అని పేరు పెట్టారు. ఒకప్పుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి చేతుల మీదుగా నిర్మించబడిన అమరావతే.. ఇప్పుడు #అమరేశ్వరుడి సన్నిధానంగా భాసిల్లుతోంది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడి స్ఫూర్తితోనే ఏపీ సర్కారు కూడా రాజదానికి "అమరావతి" అని పేరు పెట్టింది.....................................
.......................................................................
.......................................................................
.......................................................................

మీ................""ముళ్ళపూడిరవిచంద్రనాథచౌదరి @ కమ్మవారిచరిత్ర"", #కమ్మవారిచారిత్రకపరిరక్షణసాధనాసమితి,తణుకు, పశ్చిమగోదావరిజిల్లా, ఆంధ్రప్రదేశ్ (Mobile & Whats App - 09959002050)..................


No comments:

Post a Comment